బంగ్లాదేశ్తో రెండో టీ20.. 57 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో పాకిస్తాన్ గెలుపు.. పాక్‌‌‌‌‌‌‌‌దే టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌

బంగ్లాదేశ్తో రెండో టీ20.. 57 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో పాకిస్తాన్ గెలుపు.. పాక్‌‌‌‌‌‌‌‌దే టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌

లాహోర్‌‌‌‌‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో సాహిబ్జాదా ఫర్హాన్ (74), హసన్‌‌‌‌‌‌‌‌ నవాజ్‌‌‌‌‌‌‌‌ (51 నాటౌట్‌‌‌‌‌‌‌‌), మహ్మద్‌‌‌‌‌‌‌‌ హారిస్‌‌‌‌‌‌‌‌ (41) రాణించడంతో.. శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ 57 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన పాక్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 201/6 స్కోరు చేసింది. 12 రన్స్‌‌‌‌‌‌‌‌ వద్ద సైమ్‌‌‌‌‌‌‌‌ అయూబ్‌‌‌‌‌‌‌‌ (4) ఔటైనా.. ఫర్హాన్‌‌‌‌‌‌‌‌, హారిస్‌‌‌‌‌‌‌‌ రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 103 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను గాడిలో పెట్టారు.

హసన్‌‌‌‌‌‌‌‌ మహ్ముద్‌‌‌‌‌‌‌‌, తన్జిమ్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌ షకీబ్‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ 19 ఓవర్లలో 144 రన్స్‌‌‌‌‌‌‌‌కే పరిమితమైంది. తన్జిమ్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌ షకీబ్‌‌‌‌‌‌‌‌ (50) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. తన్జిద్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌ (33), మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌ (23) పోరాడి విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో ఏడుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌ స్కోరుకే పరిమితం కావడంతో బంగ్లా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అబ్రార్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఫర్హాన్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో టీ20 ఆదివారం లాహోర్‌‌‌‌‌‌‌‌లోనే జరుగుతుంది.