handshake row :భారత్ తో షేక్ హ్యాండ్ వివాదం..UAEతో పాకిస్తాన్ మ్యాచ్ రద్దు!

handshake row :భారత్ తో షేక్ హ్యాండ్ వివాదం..UAEతో పాకిస్తాన్ మ్యాచ్ రద్దు!

దుబాయ్: ఇటీవల భారత్‌తో జరిగిన హ్యాండ్‌షేక్ వివాదం క్రమంలో  ఆసియా కప్‌లో UAE తో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. హ్యాండ్‌షేక్ వివాదంలో భారత్​ పక్షాన నిలిచారని ఆరోపిస్తూ ఐసిసి మ్యాచ్ రిఫరీ ఆండీపై క్రాఫ్ట్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

అయితే జియో న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం..పాకిస్తాన్ డిమాండ్‌ను ఐసిసి తిరస్కరించింది. మరోవైపు పీసీబీ జాతీయ జట్టు సభ్యులను హోటల్‌లోనే ఉండాలని,యుఎఇతో జరిగే మ్యాచ్ కోసం వేదికకు వెళ్లొద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లను వారి హోటల్ గదుల్లోనే ఉండమని చెప్పడం మ్యాచ్​ బహిష్కరించాలనే నిర్ణయంగా తెలుస్తోంది. 

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. UAE జట్టు అప్పటికే స్టేడియానికి బయలుదేరింది.