హైదరాబాద్‌‌కు పాక్‌‌ వచ్చేసింది

హైదరాబాద్‌‌కు పాక్‌‌ వచ్చేసింది

హైదరాబాద్‌‌, వెలుగు: పాకిస్తాన్‌‌ క్రికెట్‌‌ టీమ్‌‌ ఏడేండ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టింది. బాబర్‌‌ ఆజమ్‌‌ కెప్టెన్సీలోని టీమ్‌‌ వన్డే వరల్డ్‌‌ కప్‌‌ కోసం బుధవారం రాత్రి హైదరాబాద్‌‌ చేరుకుంది. దుబాయ్‌‌ నుంచి శంషాబాద్‌‌ ఎయిర్‌‌ పోర్ట్‌‌లో దిగిన పాక్‌‌ ప్లేయర్లను భారీ భద్రతతో ప్రత్యేక బస్‌‌లో టీమ్‌‌ బస చేసే పార్క్‌‌ హయత్‌‌ హోటల్‌‌కు తీసుకెళ్లారు. 

ఆ తర్వాత వచ్చిన  న్యూజిలాండ్‌‌ టీమ్‌‌ రెండో విడత ప్లేయర్లను ఐటీసీ కాకతీయ హోటల్‌‌కు చేర్చారు. 2016 టీ20 వరల్డ్‌‌ కప్‌‌ తర్వాత తొలిసారి ఇండియా వచ్చిన పాక్​ రెండు వారాలు హైదరాబాద్‌‌లో ఉండనుంది. శుక్రవారం న్యూజిలాండ్‌‌, అక్టోబర్‌‌ 3 ఆసీస్‌‌తో వామప్‌‌ ఆడనుంది.