19 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు భారత్?: 2027 సౌత్ ఏషియన్ గేమ్స్‌పై బిగ్ ట్విస్ట్!

19 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు భారత్?: 2027 సౌత్ ఏషియన్ గేమ్స్‌పై బిగ్ ట్విస్ట్!

India vs Pakistan: కొలంబో నుంచి లాహోర్ వరకు స్పోర్ట్స్ సీన్ చాలా కలర్‌ఫుల్‌గా మారుతోంది భయ్యా. 2027 మార్చి 3 నుంచి 11వ తేదీ వరకు ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్లలో జరగబోయే సౌత్ ఏషియన్ గేమ్స్‌కి భారత్ హాజరవుతుందనే వార్త ఇప్పుడు నెట్టింట్లో ఫుల్ ట్రెండింగ్‌గా మారింది. నీరజ్ చోప్రా వంటి స్టార్ అథ్లెట్లు పాకిస్థాన్‌లో ల్యాండ్ అయి ఈటె విసిరితే ఎలా ఉంటుందో అని లంక నుంచి పాక్ మీడియా వరకు అందరూ ఊహించుకుంటూ తెగ ప్రచారం చేసే పనిలో పడ్డారు. భారత్ తో సహా 7 దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీ కోసం అప్పుడే కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది.

పాకిస్థాన్‌కి షాకింగ్ ట్విస్ట్: 

26/11, పుల్వామా, పహల్గామ్ ఘటనల తర్వాత పాకిస్థాన్ పేరు వింటేనే ఇండియన్స్ వైబ్స్ పూర్తిగా పాడైపోయాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన సౌత్ ఏషియా ఒలింపిక్ కౌన్సిల్ మీటింగ్‌కి బంగ్లాదేశ్, నేపాల్ వాళ్లు నేరుగా వెళ్తే, మన భారత డెలిగేషన్ మాత్రం మేము అటెండ్ అవుతాం కానీ కేవలం వర్చువల్ గానే అని చెప్పి షాక్ ఇచ్చింది. నేరుగా వెళ్లకుండానే మార్చి 3 నుంచి 11 తేదీల షెడ్యూల్‌కి డిజిటల్‌గా ఓకే చెప్పేశారు. విమానం ఎక్కకుండానే మీటింగ్ క్లోజ్ చేయడం చూసి పాక్ బోర్డు మెంబర్లు మైండ్ బ్లాంక్ అయ్యాయి. 

భారత్ స్పోర్ట్స్ పాలసీ: 

అసలు గొడవ లేకుండా టోర్నీలో ఆడటానికి  భారత గవర్నమెంట్ దగ్గర ఒక పక్కా మాస్ రూల్ ఉంది. పాకిస్థాన్‌తో మనకి మాత్రమే డైరెక్ట్ మ్యాచ్ (Bilateral) ఉండే అవకాశం లేదు. అదే 7–8  దేశాలు ఉండే మల్టీ-నేషన్ (Multilateral) టోర్నీ అయితే... ఓకే చెప్పడం మన సింపుల్ లాజిక్. ఈ సీక్రెట్ పాలసీ వల్లే పాక్ టీమ్‌లు భారతదేశానికి రావడం, మనోళ్లు ఐసీసీ లేదా ఇలాంటి సౌత్ ఏషియన్ గేమ్స్ టోర్నీల్లో వాళ్లతో ఆడటం జరుగుతోంది. కాబట్టి 7 దేశాల ఈ ఈవెంట్‌లో ఇండియా ఆడటం పక్కా స్కెచ్‌లాగే అనిపిస్తోంది.

అంతిమ నిర్ణయం మోడీ సర్కార్‌దే: 

అయితే ఇప్పుడున్న అసలైన సస్పెన్స్ ఏంటంటే.. పాకిస్థాన్ మీడియా ఎంత ఎగిరి గంతేసినా, అంతిమ నిర్ణయం మాత్రం భారత ప్రభుత్వం చేతిలోనే ఉంది. సెక్యూరిటీ వైబ్స్ సరిగ్గా లేకపోతే చివరి నిమిషంలో మనోళ్లు యూ-టర్న్ తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం నీరజ్ చోప్రా విసిరే ఈటె పాకిస్థాన్ గ్రౌండ్లలో ల్యాండ్ అయి కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. మరి 2027 నాటికి మన ప్లేయర్లు పాకిస్థాన్ ఫ్లైట్ ఎక్కుతారో లేక వర్చువల్‌గానే గుడ్ బై చెప్తారో చూడాలి మరీ.