
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్కప్లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ను మార్చేందుకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 15న కాకుండా 14న మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఐసీసీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇండో–పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న నిర్వహిస్తే, శ్రీలంక, పాక్ మధ్య హైదరాబాద్లో అక్టోబర్ 12న జరగాల్సిన మ్యాచ్ను 10కి మార్చనున్నారు. దీంతో ఇండియాతో పోరుకు సిద్ధమయ్యేందుకు పాకిస్తాన్కు తగినంత సమయం లభించనుంది. మరోవైపు తమ అధికారుల బృందం ఇండియా వెళ్లి జట్టు భద్రతపై రిపోర్టు ఇచ్చిన తర్వాతే వరల్డ్ కప్లో పాక్ ఆడేందుకు ఆ దేశ ప్రధాని అనుమతిస్తారని తెలుస్తోంది.