తినుడే తినుడు : హైదరాబాద్ పెషావర్ రెస్టారెంట్ లో పాకిస్తాన్ జట్టు బిర్యానీ విందు

తినుడే తినుడు : హైదరాబాద్ పెషావర్ రెస్టారెంట్ లో పాకిస్తాన్ జట్టు బిర్యానీ విందు

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు పెషావర్ రెస్టారెంట్‌లో హైదరాబాదీ వంటకాలను ఆస్వాదించింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలను సైతం టీమ్.. ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ పిక్స్ లో రెస్టారెంట్ యజమాని మోయిడ్, పాకిస్తాన్ క్రికెటర్లు షాహీన్ అఫ్రిది, బాబర్ ఆజంతో పాటు ఇతరులు ఉండడం కూడా చూడవచ్చు.

పాకిస్తాన్ జట్టు హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి పలు మార్లు బిర్యానీతో సహా హైదరాబాదీ వంటకాలను రుచి చూస్తోంది. హైదరాబాద్‌లోని పెషావర్‌తో సహా కొన్ని రెస్టారెంట్లలో వారు కనిపించారు. వారు స్థానిక బిర్యానీ రుచి చూసి కరాచీ బిర్యానీతో పోల్చారు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఇమామ్-ఉల్-హక్, కెప్టెన్ బాబర్ అజామ్ మినహా, ఇతర క్రికెటర్లు కరాచీలోని తమ స్వస్థలమైన హైదరాబాద్ బిర్యానీని మించిపోయిందని భావిస్తున్నారు.

రీసెంట్ గా హైదరాబాద్‌లోని 'జువెల్ ఆఫ్ నైజాం'లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు డిన్నర్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో, నగరంలో గట్టి భద్రత మధ్య బాబర్ ఆజంస షాహీన్ అఫ్రిదీతో సహా పాకిస్తాన్ క్రికెటర్లను చూపిస్తుంది. ఈ వీడియోలో, వారు హైదరాబాద్‌లోని VII నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 'జువెల్ ఆఫ్ నైజాం' వద్ద పెయింటింగ్‌ను మెచ్చుకోవడం కూడా చూడవచ్చు. 'జువెల్ ఆఫ్ నైజాం', పెషావర్ రెస్టారెంట్‌ను సందర్శించడంతో పాటు, పాకిస్థాన్ జట్టు హైదరాబాద్‌లో తమ విలువైన సమయాన్ని ఆస్వాదించాన్ని పలు వీడియోలు చూపిస్తున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Peshawar (@peshawarhyd)