కారు ప్రమాదం.. పాకిస్థాన్ మహిళా క్రికెటర్లకు గాయాలు

కారు ప్రమాదం.. పాకిస్థాన్ మహిళా క్రికెటర్లకు గాయాలు

 పాకిస్థాన్ జాతీయ జట్టు మహిళా బ్యాటర్ బిస్మా మరూఫ్, లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వీరిద్దరికి స్వల్ప గాయాయ్యాయి. ఈ ఘటన శుక్రవారం(ఏప్రిల్ 5) జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరికీ ప్రథమ చికిత్స అందించామని, తదుపరి చికిత్స నిమిత్తం వారిని బోర్డు వైద్య బృందం సంరక్షణలో ఉంచామని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

మరూఫ్, ఫాతిమా ఇద్దరూ త్వరలో స్వదేశంలో వెస్టిండీస్ మహిళలతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కోసం శిక్షణా శిబిరంలో భాగంగా ఉన్నారు .

ఈ ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఏప్రిల్ 18 న ప్రారంభం కానుంది, మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి.