
తొర్రూరు, వెలుగు: నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీరెడ్డి శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుందని తెలిపారు. పాలకుర్తిలోని అభివృద్ధి పనులకు అధిక నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు వారు తెలిపారు.