సత్తా చాటిన పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ రైతు బిడ్డ

సత్తా చాటిన పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ రైతు బిడ్డ

బిగ్‌బాస్ హౌసులో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi prashanth) సత్తా చూపించాడు. బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)కు తొలి కెప్టెన్ గా నిలిచి తాను ఎవరికన్నా తక్కువ కాదు అని నిరూపించాడు. నిజానికి చాలా మదిని ఇతడిని తక్కువ అంచనా వేశారు కానీ.. ఈ సీజన్ మొట్టమొదటి కెప్టెన్ గా నిలిచాడు.

ముందుగా కెప్టెన్సీ టాస్కులో భాగంగా రంగు పడుద్ది అనే టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సందీప్, గౌతమ్,ప్రశాంత్,తేజ పాల్గొన్నారు. ఈ గేమ్ కు సంచలక్ గా ప్రియాంక ను నియమించారు బిగ్ బాస్. ఈ గేమ్‌లో.. ఓ సర్కిల్ ఉంటుంది. అందులో నలుగురు నిలబడి ఒకరు మరొకరి టీ షర్ట్‌పై మరొకరు చేతులతో రంగు పూయాల్సి ఉంటుంది. బజర్ మోగేలోపు ఎవరి టీ షర్ట్‌పై ఎక్కువ రంగు ఉంటె వాళ్లు గేమ్ నుండి ఎలిమినేట్ అవుతారు. అలా తొలి రెండు రౌండ్లలో సందీప్, తేజ టాస్క్ నుండి ఎలిమినేట్ అవగా.. ప్రశాంత్ అండ్ గౌతమ్ ఫైనల్ రౌండ్ కోసం మిగిలారు. ఈ రౌండ్‌లో గౌతమ్-ప్రశాంత్ ఒకరిపై ఒకరు పోటీపడి కలర్స్ పూసుకున్నారు. రౌండ్ పూర్తయిన తర్వాత ఇద్దరినీ చాలాసేపు పరీక్షించిన సంచాలక్ ప్రియాంక.. పల్లవి ప్రశాంత్‌ని విజేతగా ప్రకటించింది. అలా బిగ్ బాస్ సీజన్ 7లో తొలి కెప్టెన్ గా మారదు ప్రశాంత్.