ముగిసిన పల్లె, పట్టణ ప్రగతి

ముగిసిన పల్లె, పట్టణ ప్రగతి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లో ఐదో విడత పల్లె ప్రగతి, 142 మున్సిపాలిటీల్లో నాలుగో విడత పట్టణ ప్రగతిని ఈ నెల మూడో తేదీన ప్రారంభించారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ సహా పలు కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యయ్యారు.