సాధారణంగా తాటి చెట్టు నుంచి కల్లు గీసేందుకు లొట్లను కడుతారు. కానీ కరోనా ఎఫెక్ట్తో ప్రస్తుతం సీన్ మారింది. కల్లు లొట్ల ప్లేస్లోకి ప్లాస్టిక్ బకెట్లు వచ్చి చేరుతున్నాయి. లాక్ డౌన్తో గీత కార్మికులకు లొట్లు దొరకడం లేదు. దీంతో సిద్దిపేట జిల్లాచిన్నకోడూర్ మండలం మైలారం గ్రామానికిచెందిన బుడుగు ముత్తయ్యగౌడ్ ప్రత్యామ్నాయం అలోచించాడు. లొట్ల ప్లేస్ లో ఏకంగా ప్లాస్టిక్ బకెట్లను కట్టి కల్లు గీస్తున్నాడు.

