పంబన్ బ్రిడ్జి ఓపెన్..వంతెన దాటిన 50 ఫిషింగ్ బోట్లు

పంబన్ బ్రిడ్జి ఓపెన్..వంతెన దాటిన 50 ఫిషింగ్ బోట్లు

తమిళనాడులోని రామేశ్వరంలో మత్స్యకారులు, ఫిషింగ్ బోట్లు వెళ్లేందుకు పంబన్ రైల్వే బ్రిడ్జిని ఓపెన్ చేశారు. వంతెన తెరవడంతో తొలిరోజే 50కి పైగా పడవలు పంబన్ బ్రిడ్జిని దాటాయి. పడవలు  వంతెన దాటుతున్న వీడియో వైరల్ అవుతోంది. 

పంబన్  సస్పెన్షన్ రైల్వే బ్రిడ్జిని తెరిచిన వెంటనే కొన్ని పడవలు వరుసగా బ్రిడ్జిని దాటాయి. మరికొన్ని పడవలు వచ్చినప్పుడల్లా బ్రిడ్జి రెండుగా విడిపోవడం ఆకట్టుకుంటుంది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ వంతెనపై నుంచి రైళ్ల రాకపోకలను నిలిపేయాలని తాజాగా దక్షిణ మధ్య  రైల్వే నిర్ణయించింది.