విరూపాక్ష.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ

విరూపాక్ష.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ

సాయి ధరమ్‌‌ తేజ్‌‌ హీరోగా నటించిన పాన్ ఇండియా మిస్టరీ థ్రిల్లర్‌‌ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్. కార్తీక్ దండు దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్‌‌తో కలిసి బీవీఎస్‌‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మంగళవారం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌కు అల్లు అర‌‌వింద్‌‌, దిల్ రాజు అతిథులుగా హాజరయ్యారు. తేజ్ మాట్లాడుతూ ‘ఎంతో ప్రేమించి, కష్టపడి  ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈనెల 21న బ్లాక్ బస్టర్‌‌‌‌ న్యూస్‌‌తో మాట్లాడుకుందాం. స‌‌పోర్ట్ చేయ‌‌టానికి వ‌‌చ్చిన‌‌ దిల్ రాజు, అర‌‌వింద్‌‌ గారికి థ్యాంక్స్‌‌’ అన్నాడు. దిల్ రాజు మాట్లాడుతూ ‘ప్రతి మనిషికి జీవితంలో పడటం, లేవడం కామన్.

తేజ్‌‌ లైఫ్‌‌లో యాక్సిడెంట్ రూపంలో చిన్న బ్రేక్ పడింది. అతను రికవర్ అయి చేసిన మొదటి సినిమా ఇది. ట్రైలర్‌‌‌‌లో కంటెంట్ క‌‌నిపిస్తోంది. తేజ్ రీఎంట్రీ సినిమా పెద్ద స‌‌క్సెస్ అవుతుంది’ అని విష్ చేశారు. అల్లు అర‌‌వింద్ మాట్లాడుతూ ‘యాక్సిడెంట్ నుంచి కోలుకుని ఈ సినిమాలో నటించిన తేజ్‌ను అద్భుతంగా నటించాడని అందరూ అంటుంటే వినడానికి చాలా సంతోషంగా ఉంది. ‘విరూపాక్ష’ ట్రైలర్‌‌‌‌ చూస్తుంటే భారీ ఓపెనింగ్స్ వస్తాయనిపిస్తోంది. అన్ని డిపార్ట్‌‌మెంట్స్ ప‌‌డ్డ క‌‌ష్టం కనిపిస్తోంది’ అన్నారు. ఈ చిత్రానికి పనిచేయడం హ్యాపీ’ అన్నారు డీవోపీ శ్యామ్‌‌ దత్. ‘మొదటి నుండి సినిమాకు అన్ని పాజిటివ్‌‌గానే కుదిరాయి. కచ్చితంగా అంద‌‌రికీ న‌‌చ్చుతుంది’ అని నిర్మాత బీవీఎస్‌‌ఎన్ ప్రసాద్ అన్నారు.