V6 News

ముంపు గ్రామాల్లో.. ఎన్నికలు

ముంపు గ్రామాల్లో.. ఎన్నికలు

యాదాద్రి, వెలుగు: బస్వాపురం రిజర్వాయర్​కారణంగా ముంపునకు గురవుతున్న మూడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని... రెండు గ్రామాల్లో సర్పంచ్‌లను ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో గ్రామంలో ఫస్ట్​ ఫేజ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.  కాళేశ్వరం ప్యాకేజీ 16లో భాగంగా బస్వాపురం రిజర్వాయర్​ను రూ. 1578 కోట్ల అంచనా వ్యయంతో 11.39 టీఎంసీల సామర్థ్యంతో  నిర్మించడానికి 2019లో నోటిఫికేషన్​రిలీజ్​చేశారు. ఈ రిజర్వాయర్​ కోసం 4232 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఇప్పటికే బండ్​నిర్మాణం చాలా భాగం పూర్తయింది. అయితే ఈ రిజర్వాయర్​లో నీటిని నింపితే భువనగిరి మండలంలోని బీఎన్​తిమ్మాపురం, తుర్కపల్లి మండలం చోక్లానాయక్​ తండా, యాదగిరిగుట్ట మండలం లప్ప నాయక్​ తండా మునిగిపోనున్నాయి. ముంపునకు గురవుతున్న లప్ప నాయక్​ తండాలో ఆరు వార్డులు ఉండగా 426 మంది ఓటర్లు ఉన్నారు. చోక్లా నాయక్​ తండా, బీఎన్​ తిమ్మాపురం గ్రామాల్లో సర్పంచ్​లు, పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 11న జరిగే మొదటి దశలో  లప్ప నాయక్​ తండాలో ఎన్నికలు జరగనున్నాయి.