జూనియర్​ పంచాయతీ .. సెక్రటరీ ఆత్మహత్య

జూనియర్​ పంచాయతీ .. సెక్రటరీ ఆత్మహత్య

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ జూనియర్ పంచాయతీ సెక్రటరీ పుట్ట సబిత్​రెడ్డి(29) వ్యక్తిగత కారణాలతో బుధవారం పల్లె ప్రకృతి వనంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..   దోమకొండ మండలం సంగమేశ్వర్​కు చెందిన సబిత్​రెడ్డి కొంతకాలంగా ఉగ్రవాయిలో జేపీఎస్​గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే అతడి ఉద్యోగం కూడా రెగ్యులరైజ్​అయింది. 

బుధవారం తన సొంతూరు నుంచి డ్యూటీ కోసం ఉగ్రవాయికి వచ్చాడు. పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకోగా పంచాయతీ సిబ్బంది చూసి సర్పంచ్​కు సమాచారమిచ్చారు. భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి నర్సింహారెడ్డి దేవునిపల్లి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మృతుడి వద్ద లభించిన లెటర్​ను పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు.