టీడీపీ నాయకుడు: తుగ్లక్ లా నడీ రోడ్డుపై…

టీడీపీ నాయకుడు:  తుగ్లక్ లా నడీ రోడ్డుపై…

కడప: నడిరోడ్డుపై ఓ టీడీపీ నాయకుడు పిచ్చితుగ్లక్ లా బిహేవ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రైల్వే కోడూరు లోని మార్కెట్ వద్ద పిచ్చి పట్టిన వారిలా ప్రవర్తించారు టీడీపీ నాయకులు పంథగాని నరసింహ ప్రసాద్. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తుగ్లక్ లా పరిపాలిస్తున్నారని … అందుకే తాను పిచ్చితుగ్లక్ వేషం వేసుకుని నడిరోడ్డులో పిచ్చివానిలా ప్రవర్తించి నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు. జగన్ చేస్తున్న పిచ్చి పాలన… ఎప్పుడో 700సంవత్సరాల క్రితం చనిపోయిన తుగ్లక్ చర్యలను గుర్తుచేస్తుందని ఆయన చెప్పారు.