
కవిన్, అపర్ణా దాస్ జంటగా గణేష్ కె బాబు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘డాడా’, ‘పాపా’ పేరుతో తెలుగులోకి వస్తోంది. జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నీరజ కోట తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈనెల 13న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం ట్రైలర్ను విడుదల చేశారు. సీనియర్ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ ట్రైలర్ను విడుదల చేశారు. ఎమోషన్స్తో కూడిన ఫ్యామిలీ డ్రామాగా తమిళంలో మెప్పించిన ఈ సినిమా తెలుగులోనూ ఘనవిజయం సాధించాలని వాళ్లిద్దరూ బెస్ట్ విషెస్ చెప్పారు.
నిర్మాతలు నీరజ కోట, శశికాంత్ మాట్లాడుతూ ‘మనుషులుగా మనం ఎంత ఆధునిక జీవితాన్ని సాగిస్తున్నా, మనలోని హ్యూమన్ ఎమోషన్స్, విలువలు మారవు అని చెప్పే చిత్రమిది. ఈ ఫీల్గుడ్ ఫ్యామిలీ డ్రామాను మొదట రీమేక్ చేయాలనుకున్నప్పటికీ ఒరిజినల్లోని సోల్ మిస్ అవుతుందని డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాం’ అని తెలియజేశారు.