మానేరుతీరంలో పారాచూట్ విన్యాసాలు

మానేరుతీరంలో పారాచూట్ విన్యాసాలు

మానేరు అందాలతో పాటు తీగల వంతెన, కరీంనగర్ పట్టణాన్ని ఆకాశం నుంచి వీక్షించే అవకాశం ప్రజలకు త్వరలో రాబోతుంది. మానేరు నది తీరంలో పారాచూట్ విన్యాసాలు అందుబాటులోకి రానున్నాయి.  దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు అధికారులు. మూడు రోజులుగా మానేరు మీదుగా ఆకాశంలో ఎగిరేందుకు సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించారు.  పారాచూట్ విన్యాసాలకు మానేరు అనువుగా ఉందా లేదా అని పరిశీలించి అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పారాచూట్ విన్యాసాలకి మానేరు ప్రాంతం అనువుగా ఉందన్నారు పైలట్ సుకుమార్. అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. దీంతో కరీంనగర్ను ఆకాశం నుంచి చూసేలా, అలాగే ఎయిర్ షోలో పాల్గొనే అవకాశం వస్తుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 



మరిన్ని వార్తల కోసం..

తుంగభద్ర జలాశయం సరికొత్త రికార్డు

పంజాబ్లో ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో?