- భట్టికి పరశురామ్ వినతి
న్యూఢిల్లీ, వెలుగు: ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముంద్రించేలా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి (సీఏపీఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ కోరారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేశారు. తమ విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.