- సర్కారు టీచర్లదీ ఇదే మాట
- కరోనా పరిస్థితుల్లో టెన్షన్
- నవంబర్ లేదా డిసెంబర్అయితే ఓకే
- పేరెంట్స్ ఒపీనియన్ పై ప్రైవేట్ సూల్స్ సర్వేలు
హైదరాబాద్, వెలుగు: లాక్డౌన్తో నిలిచిపోయిన క్లాస్ రూమ్ టీచింగ్ను తిరిగి ఈ నెల 21 నుంచి ప్రారంభించాలన్న కేంద్రం ఆదేశాలతో పేరెంట్స్ ఆలోచనలో పడ్డారు. గ్రేటర్లో అమలు చేస్తారా, లేదా అన్నది క్లారిటీ లేకపోయినా.. కరోనా పరిస్థితుల్లో ఇప్పడప్పుడే పిల్లలను స్కూల్స్కి పంపేందుకు ఎక్కువమంది ఇంట్రస్ట్ గా లేరు. స్కూల్ బస్సులు, క్లాస్ రూమ్స్లో ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ వంటివి వాటిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్లాస్కు హాజరైన స్టూడెంట్కి వైరస్ ఎటాక్ అయితే ఇంట్లో ఉండే వృద్ధులు కరోనా బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. స్కూల్స్ రీ ఓపెన్పై పేరెంట్స్ ఓపీనియన్ తెలుసుకునేందుకు ఇటీవల కొన్ని కార్పొరేట్ స్కూల్స్ సర్వేలు చేయగా.. 80 శాతం పేరెంట్స్ ఇప్పుడు స్కూల్ కంటే ఇల్లే సేఫ్ అని అభిప్రాయపడినట్టు మేనేజ్మెంట్లు చెప్తున్నాయి. సర్కారు టీచర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సర్వేతో వైరస్ బారిన టీచర్లు
ఈ నెల ఒకటి నుంచి సర్కారు స్కూళ్లలో డిజిటల్క్లాస్లు మొదలయ్యాయి. వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం టీచర్లతో డోర్ టు డోర్ సర్వే చేయిస్తోంది. ఈ క్రమంలో రాష్ర్టవ్యాప్తంగా 600 మందికిపైగా టీచర్లు కరోనా బారిన పడ్డట్లు ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 30, రంగారెడ్డిలో 29, మేడ్చల్లో45 మందికి పాజిటివ్వచ్చినట్లు తెలిపాయి. బుక్స్ పంపిణీ టైమ్లోనూ కొందరు కరోనా బారిన పడ్డట్టు గుర్తుచేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న లంగర్హౌస్కి చెందిన హెచ్ఎం చనిపోయారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో క్లాస్రూమ్ టీచింగ్ వద్దని టీచర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గైడ్ లైన్స్ ఇలా..
21 నుంచి 9–-12 తరగతుల స్టూడెంట్స్కి క్లాస్రూమ్ టీచింగ్ స్టార్ట్ చేయాలన్న సెంట్రల్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ గైడ్లైన్స్ కూడా రిలీజ్చేసింది. స్టూడెంట్స్, టీచర్లకి మాస్క్ మస్ట్ చేసింది. స్టూడెంట్స్మధ్య 6 ఫీట్ల దూరం పాటించాలి. స్కూల్లో విద్యార్థులు ఉమ్మి వేయకుండా జాగ్రత్త లు పాటించాలని పేర్కొంది. సిటీలోని చాలావరకు స్కూళ్లలో ఇరుకు గదుల్లోనే క్లాస్లు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫిజికల్డిస్టెన్స్ సాధ్యం కాకపోవచ్చని పేరెంట్స్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నవంబర్ లేదా డిసెంబర్లో అయితే బెటర్అంటున్నారు.
రిస్క్ తీసుకోలేం
కరోనా పరిస్థితుల్లో పిల్లలను స్కూల్ పంపి రిస్క్ తీసుకోలేం. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. వాటినే కంటిన్యూ చేయిద్దాం అనుకుంటున్నాం. కనీసం డిసెంబర్ వరకైనా పిల్లలను స్కూల్స్కి పిలవొద్దు.
-వినోద్కుమార్, పేరెంట్, సికింద్రాబాద్
గైడ్లైన్స్ పాటిస్తే ఓకే
ప్రతి క్లాసులో స్టూడెంట్స్కి సంఖ్య 15కి మించకుండా క్లాస్లు కండక్ట్ చేస్తే బాగుం టుంది. డైలీ స్కూల్ ఆవరణ, క్లాస్ రూమ్ శానిటైజ్ చేయాలి. ఫిజికల్ డిస్టెన్సింగ్ ఏర్పాట్లు చేయాలి. అలాకాకుండా ఏదో నామమాత్రంగా నడిపితే టీచర్లు, స్టూడెంట్స్ వైరస్ బారినపడే ప్రమాదముంది.
-బి.రామకృష్ణ, డీటీఎఫ్ ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్
పేరెంట్స్ ఇంట్రెస్ట్గా లేరు
స్కూల్స్ రీ ఓపెన్ చేస్తే పిల్లలను పంపుతారా అనే దానిపై పేరెంట్స్ ఒపీనియన్ తెలుసుకునేందుకు కొన్ని క్వశ్చన్స్తో ఒక ఫామ్ ని తయారు చేసి పంపించాం. 80 శాతం పేరెంట్స్ ఇప్పుడే పంపించమని చెప్పారు. నవంబర్, డిసెంబర్లో పంపుతాం అంటున్నారు.
రాధ, పల్లవి ఇనిస్టిట్యూషన్స్ అకడమిక్ డైరెక్టర్