NSD ఛైర్మన్ గా ప్రముఖ నటుడు పరేష్ రావల్

NSD ఛైర్మన్ గా ప్రముఖ నటుడు పరేష్ రావల్

ప్రముఖ నటుడు , బీజేపీ నేత పరేష్ రావల్ కు కీలక పదవి వచ్చింది. పరేష్ రావల్ కు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(NSD) ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర  సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్   ప్రకటించారు. ప్రముఖ కళాకారుడు పరేష్ రావల్ ను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛైర్మన్ గా రాష్ట్రపతి భవన్ నియమించారని తెలిపారు.. విద్యార్థులు , కళాకారులు అతని ప్రతిభను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

2017 నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. పరేష్ రావల్ మరో నాలుగేళ్లు ఈ పదవిలో ఉండనున్నారు. ఈ సందర్బంగా పరేష్ మాట్లాడూతూ..సవాళ్లతో కూడుకున్నది అయినా తన వంతు కృషి చేస్తానన్నానరు.  పరేష్ రావల్ తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్, మనీ సినిమాల్లో నటించారు.

నాకు నష్టపరిహారం ఇప్పించండి: కంగనా రనౌత్

కరోనా ఉగ్రరూపం..ఒక్కరోజే 96,551 కేసులు..1209 మరణాలు

చైనా ఆక్రమిత భూమిని ఎప్పుడు స్వాధీనం  చేసుకుంటారు?