సీఎం వరి వేయొద్దంటే.. ఎమ్మెల్యే నాటేసిండు..

సీఎం వరి వేయొద్దంటే.. ఎమ్మెల్యే నాటేసిండు..

యాసంగిలో రైతులు వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్​ చెప్పగా.. ఎమ్మెల్యే ఏమో నాటు వేసి రైతు బంధు సంబురాలు చేసిండు. యాసంగిలో  రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సీఎం సూచించినది తెలిసిందే. పరిగి ఎమ్మెల్యే  కొప్పుల మహేశ్​ రెడ్డి మాత్రం వరి నాటు వేసి ఆశ్చర్యపరిచారు. బుధవారం పరిగి మండలం గోవిందాపూర్ శివారులోని ఆర్ఎంపీ గఫార్ పొలంలో ఎమ్మెల్యే  వరి నాటు వేసి,  రైతుబంధుపై కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. ‘రైతుబంధు కేసీఆర్’​ఆకారంలో నాటు వేసి,  సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ ముఖ్య నేతలు,  రైతు వేదిక అధ్యక్షుడు,  సర్పంచులు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం.  -  వెలుగు, పరిగి