
పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా షూటర్ మను భాకర్ మరో పతకం దిశగా అడుగులు వేసింది. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం క్వాలిఫికేషన్లో మను ఫైనల్లో అడుగుపెట్టింది. 590 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొదటి ఎనిమిది మంది షూటర్లు ఫైనల్ చేరుకుంటారు. మను పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ చేరడం ఇది మూడోసారి.
అంతకుముందు మను భాకర్..10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు సాధించింది. తద్వారా, ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్గా, మహిళా షూటర్గా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఆమె మూడోసారి ఫైనల్ చేరడంతో.. భారత్ ఖాతాలో మరో పతకం చేరడం ఖాయమన్న మాటలు వినపడుతున్నాయి. అదే జరిగితే, మను ఒక ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకాలు సాధించిన భారత క్రీడాకారిణిగా అవతరిస్తుంది.
కాగా, ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత షూటర్ ఇషా సింగ్ 581 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది.
?? ??????? ????? ??? ????! Terrific performance from Manu Bhaker once again to book her spot in yet another final. Can she go on to win a third medal at #Paris2024?
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 2, 2024
? Manu Bhaker finished at 2 with a score of 590-24x.
? Esha Singh unfortunately missed out… pic.twitter.com/qCUUNZhpgh