కరోనా ఎఫెక్ట్తో ముందే ముగింపు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడటంతో వచ్చే బుధవారంతో సమావేశాలను ముగించాలని కేంద్రం భావిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు శనివారం జరిగిన లోక్సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) మీటింగ్లో ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన మీటింగ్లో పార్టీలు సమావేశాలను షెడ్యూల్కంటే ముందే ముగించాలన్నట్టు తెలిసింది. పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది.సమావేశాలు మొదలైన తర్వాత ఇప్పటి వరకూ 30 మంది ఎంపీలు, 50 మంది పార్లమెంట్ కాంప్లెక్స్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది.