
న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన కొత్త ఆదాయపు పన్ను బిల్లుపై సమీక్షించిన పార్లమెంటరీ ప్యానెల్, టీడీఎస్ (టీడీఎస్) రీఫండ్ క్లెయిమ్లు, ట్రస్ట్ల పన్నులపై కీలక మార్పులను సూచించింది. గడువులోగా ఐటీ రిటర్న్లు దాఖలు చేయని వారికి కూడా టీడీఎస్ రీఫండ్లను క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా రూల్స్ను మార్చాలని సూచించింది. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని చిన్న పన్ను చెల్లింపుదారులకు ఇది ఉపశమనం కలిగిస్తుందని కమిటీ పేర్కొంది. మతపరమైన, స్వచ్ఛంద ట్రస్ట్లకు వచ్చే అనామక విరాళాలపై పన్ను మినహాయింపులు రద్దు చేయాలన్న ప్రతిపాదనను కూడా కమిటీ వ్యతిరేకించింది. ఈ ట్రస్ట్లకు పన్ను మినహాయింపులు కొనసాగించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది.