కలిసి కట్టుగా బీజేపీని బలోపేతం చేయాలి : రాథోడ్ రమేశ్

కలిసి కట్టుగా బీజేపీని బలోపేతం చేయాలి :  రాథోడ్ రమేశ్

మంచిర్యాల/జన్నారం, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ గ్రామాల్లో బీజేపీని బలపేతం చేయాలని మాజీ ఎంపీ, ఆ పార్టీ లీడర్ రాథోడ్ రమేశ్ కార్యకర్తలకు సూచించారు. ఆదివారం జన్నారం మండలంలోని తపాలపూర్ గ్రామంలో ‘ఇంటింటా బీజేపీ’ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలన్నారు. ఆయన వెంట పార్టీ మండల ప్రెసిడెంట్ గోలి చందు, జనరల్ సెక్రెటరీ వంగపెల్లి సురేశ్, ఎస్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ బద్రి నాయక్, తిమ్మాపూర్ ఎంపీటీసీ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీతో అభివృద్ధి సాధ్యంరాష్ట్రంలో బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు అన్నారు. ఆదివారం ఆయన మంచిర్యాల మున్సిపాలిటీ 4వ వార్డు శ్రీకృష్ణ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మంచిర్యాల పట్టణాభివృద్ధిలో ఎమ్మెల్యే దివాకర్​రావు విఫలమయ్యారని ఆరోపించారు. ఆయన వెంట పోలింగ్ బూత్ అధ్యక్షుడు రాకేశ్, పట్టి వెంకటకృష్ణ, మల్లికార్జున్, ముదాం మల్లేశ్, రాకేశ్​రేన్వ ఉన్నారు.