
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ ‘రంగమార్తండ’ పై పరుచూరి గోపాల కృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సినిమాలో రంగస్థల నటులుగా బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ను గొప్పగా చూపారు. అయితే, ఆ డెప్త్ను తెలిపేలా కొన్ని సీన్స్ రాసుకుంటే బాగుండేది. క్లైమాక్స్లో భార్య కన్నుమూయడం.. రాఘవరావు సైతం కళాభారతిలోనే పిల్లల సమక్షంలో మరణించినట్టుగా చూపిస్తారు.
దానికి బదులు ఆ కుటుంబం కళాభారతిని కొత్తగా నిర్మించినట్టుగా చూపించి కథను ముగిస్తే సినిమా మరో స్థాయిలో ఉండేది అంటూ ఈ సీనియర్ రైటర్ అభిప్రాయపడ్డాడు. నాకెందుకులే అని సమాజం విస్మరిస్తున్న రోజుల్లో దర్శకుడు ఇలాంటి పాయింట్తో సినిమా తీయడం అభినందనీయమన్నాడు. తల్లిదండ్రుల్ని కూతురు సెల్లార్లో పడుకోమని చెప్పేటువంటి కొన్ని సీన్లు నిజంగా ఏడిపించేశా