బ్రెస్ట్ క్యాన్సర్ తో అమ్మ చనిపోయిందని.. ఆ పేషెంట్లకు ఆర్థిక సాయం 

బ్రెస్ట్ క్యాన్సర్ తో అమ్మ చనిపోయిందని.. ఆ పేషెంట్లకు ఆర్థిక సాయం 

యాదాద్రి భువనగిరి జిల్లా: క్యాన్సర్ తో చనిపోయిన తన తల్లి పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసిన ఆ కోడుకు .. క్యాన్సర్ పేషెంట్లకు తోచిన సాయం చేస్తున్నాడు.  తన అమ్మ క్యాన్సర్ మహమ్మారితో పోరాడి చివరకు ప్రాణాలు విడిచిందని.. అలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలంలోని, కూనూరు గ్రామానికి చెందిన పాశం సుగుణ 2014లో బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోయిందని.. ఆ సమయంలో కనీసం మందలకు కూడా తన దగ్గర డబ్బులు లేకుండేవని చెప్పాడు. ఈ క్రమంలోనే తన తల్లిని కాపాడుకోలేక పోయానంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ప్రస్తుతం తన తల్లిపేరుతో సుగుణ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించిన పాశం శివానంద్.. సుగుణ వర్థంతి రోజున భువనగిరి మండలంలోని క్యాన్సర్ రోగులకు ఆర్ధిక సాయం అందిస్తున్నాడు. సోమవారం పాశం సుగుణ వర్థంతి సందర్భంగా దాదాపు 20 మందికి పైగా పేద పేషెంట్లకు ఒక్కొక్కరికి రూ.5 వేలు, 3 వేలు అందజేసి మంచి మనసు చాటుకున్నాడు ట్రస్ట్ చైర్మైన్ పాశం శివానంద్. ఈ సేవలు ప్రతి ఏటా కొనసాగిస్తానని చెప్పాడు.