
న్యూఢిల్లీ: లోక్సభ శుక్రవారం ఫైనాన్స్ బిల్లు 2023 ను ఆమోదించింది. ఈ ఫైనాన్స్ బిల్లుకు 64 సవరణలు చేశారు. ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభలో సవరణలతో కూడిన ఈ ఫైనాన్స్ బిల్లును ఆమోదించారు. అదానీ గ్రూప్ కంపెనీలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తూ, ప్రతిపక్షాల సభ్యులు గొడవకు దిగడంతో ఫైనాన్స్ బిల్లుపై ఎలాంటి చర్చ జరగలేదు.
64 సవరణలతో కూడిన ఫైనాన్స్ బిల్లును ఆమోదం కోసం లోక్సభలో మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. బడ్జెట్ను గురువారం నాడే ఆమోదించారు. సవరణల నేపథ్యంలో ఫైనాన్స్ బిల్లులో కొత్తగా 20 సెక్షన్లను చేర్చారు. లోక్సభ ఆమోదం రావడంతో ఈ ఫైనాన్స్ బిల్లును ఇప్పుడు రాజ్యసభకు పంపనున్నారు.