
హైదరాబాద్, వెలుగు: ఈనెల 22న పాస్పోర్టు అపాయింట్మెంట్లను రీ షెడ్యూల్ చేస్తూ హైదరాబాద్ రీజనల్పాస్పోర్టు ఆఫీసు నిర్ణయం తీసుకుంది. అయోధ్య భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 22 న సెలవు ప్రకటించింది.
దీంతో అపాయింట్మెంట్లను మధ్యాహ్నం వరకు రీషెడ్యూల్చేస్తూ హెచ్ఆర్పీవో ప్రకటన జారీ చేశారు. పాస్పోర్టు కేంద్రాలకు రాలేని వారు అందుబాటులోని మరో తేదీకి అపాయింట్మెంట్స్ ను మార్చుకునే వెసులుబాటు ఉంది.