పీఎం కేర్స్​కు పాట్ కమిన్స్​ భారీ విరాళం

పీఎం కేర్స్​కు పాట్ కమిన్స్​ భారీ విరాళం

ముంబై: కరోనా సెకండ్​ వేవ్​ వల్ల ఇండియాలో నెలకొన్న పరిస్థితిని చూసి ఆస్ట్రేలియా పేసర్​ పాట్​కమిన్స్ తన వంతు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. కమిన్స్​​రూ. 37.42 లక్షలు(50,000 అమెరికన్​ డాలర్లు) ​ మొత్తాన్ని పీఎం కేర్స్​ ఫండ్​కు సోమవారం డొనేట్ చేశాడు. ఆక్సిజన్​ అవసరాల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని పేసర్​ కోరాడు. అలాగే, ఐపీఎల్​కొనసాగాలన్నాడు. ‘ఓ క్రికెటర్​గా నాకు దక్కిన ప్లాట్​ఫామ్​ను మంచి కోసం ఉపయోగిస్తున్నా. పీఎం కేర్స్​ ఫండ్​కు విరాళం అందజేశా. ఇప్పుడున్న సిచ్యువేషన్​లో అది చాలా చిన్నది అని నాకు తెలుసు. కానీ నేను చేసిన సాయం వల్ల కనీసం ఎవరో ఒకరికి మేలు జరుగుతుందని నమ్ముతున్నా.  ఐపీఎల్​ టీమ్‌‌మేట్స్‌‌తో పాటు ఇండియాతో అనుబంధం ఉన్న వారంతా సాయం చేయాలని కోరుతున్నా.  ఇక, ఇలాంటి కష్ట సమయంలో ఐపీఎల్​ను నిర్వహించడం అవసరమా అనే చర్చ ఇటీవల ఎక్కువగా జరుగుతుంది. టోర్నీ ఆగిపోతుందని అంటున్నారు. అయితే, ఇండియన్​ గవర్నమెంట్​కు నాదో మనవి. లాక్​డౌన్​వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఐపీఎల్​ మ్యాచ్​ల తో కొన్ని గంటల ఆట విడుపు లభిస్తోంది. కాబట్టి లీగ్​ను కొనసాగించాలి’ అని కమిన్స్​ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.