
- పటాన్చెరు బీఆర్ఎస్ కోఆర్డినేటర్ఆదర్శ్ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ పటాన్చెరు కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని, సబితా, పద్మారావు, మహమూద్అలీ తదితరులు జూబ్లీహిల్స్ అభ్యర్థి సునీత గోపీనాథ్కు మద్దతుగా ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత మాగంటి గోపీనాథ్ సారథ్యంలో జూబ్లీహిల్స్ ఎంతో ముందుకు వెళ్లిందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పరితపించిన గోపీనాథ్ కుటుంబానికే నియోజకవర్గ ప్రజల మద్దతు ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని చెప్పారు. కార్యకర్తలంతా సమన్వయంతో పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుమార్ యాదవ్, మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి, మేరాజ్ ఖాన్తదతరులు పాల్గొన్నారు.