Patanjali News: పతంజలి లావాదేవీలపై కేంద్రం నిఘా.. 4.5 శాతం స్టాక్ పతనం, ఏమౌతోంది?

Patanjali News: పతంజలి లావాదేవీలపై కేంద్రం నిఘా.. 4.5 శాతం స్టాక్ పతనం, ఏమౌతోంది?

Patanjali Probe: యోగా గురువు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బాబా రామ్‌దేవ్ కంపెనీనే పతంజలి ఆయుర్వేద లిమిటెడ్. ప్రస్తుతం ఈ కంపెనీకి కష్టాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల కిందట తప్పుడు ప్రమోషన్ల విషయంలో చిక్కుకున్న బాబా కంపెనీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిఘాలోకి వెళ్లటం గమనార్హం.

వాస్తవానికి కంపెనీ నిధుల మళ్లింపు, కార్పొరేట్ ఉల్లంఘనలపై దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కార్పొరేట్ వ్యవరాల మంత్రిత్వ శాఖ నుంచి కంపెనీకి నోటీసులు రావటంతో కంపెనీ షేర్ ధర నేడు ఇంట్రాడేలో 5 శాతం మేర పతనం అయ్యింది. దర్యాప్తు ప్రస్తుతానికి ప్రారంభ దశలోనే ఉండటంతో పూర్తి సమాచారం బయటకు రాలేదు. అలాగే కేంద్రం ఇచ్చిన నోటీసులపై స్పందించటానికి కంపెనీకి రెండు నెలలు గడువు ఇవ్వటం జరిగింది. 

►ALSO READ | SEBI News: బాలీవుడ్ నటుడిపై సెబీ బ్యాన్.. 57 సంస్థలపై నిషేధం..

గత ఏడాది కంపెనీ యూనిట్లలో ఒకదానిపై పన్ను ఉల్లంఘనలతో పాటు తప్పుడు రిఫండ్ క్లెయిమ్ కి సంబంధించి కంపెనీ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే వరుస వివాదాల్లోకి పతంజలి సంస్థ కూరుకుపోవటంపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరుగుతున్నాయి. పతంజలి ఆయుర్వేద చుట్టూ ఉన్న వివాదాలు దాని లిస్టెడ్ అనుబంధ సంస్థ పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. నేడు మార్కెట్లు ముగిసే సమయానికి పతంజలి స్టాక్ ధర ఒక్కోటి రూ.వెయ్యి 681 వద్ద నాలుగు శాతానికి పైగా నష్టపోయింది.