గాంధీ ఆస్పత్రిలో పేషెంట్ మిస్సింగ్

గాంధీ ఆస్పత్రిలో పేషెంట్ మిస్సింగ్

పద్మారావునగర్, వెలుగు :  గాంధీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న పేషెంట్ కనిపించకుండాపోయాడు. చిలకలగూడ ఎస్సై కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్​కు చెందిన జి. యాదిలాల్(55) హై బీపీతో బాధపడుతూ ఈ నెల 5న గాంధీ హాస్పిటల్​లో అడ్మిట్ అయ్యాడు. అతడికి డాక్టర్లు ట్రీట్​మెంట్ చేస్తున్నారు. ఈ నెల 9న సాయంత్రం యాదిలాల్ భార్య గాయత్రి.. డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రి పై అంతస్తులోని ఆరోగ్యశ్రీ వార్డుకు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి బెడ్​పై యాదిలాల్ కనిపించలేదు. ఆస్పత్రి మొత్తం వెతికినా భర్త కనిపించకపోవడంతో ఆమె చిలకలగూడ పీఎస్​లో కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.