హైదరాబాద్, వెలుగు:సూర్యాపేట జిల్లాకు చెందిన బాలింతకు న్యూరో ప్రాబ్లమ్రావడంతో డాక్టర్లు సిటీకి రెఫర్ చేశారు. న్యూరో ఫిజిషియన్ను చూయించేందుకు ఫ్యామిలీ మెంబర్ బీఎన్రెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకురాగా, ఓపీ లేదని చెప్పారు. ఎర్రగడ్డలోని మరో ప్రైవేట్ఆస్పత్రికి వెళ్లగా, అక్కడా సేమ్ ప్రాబ్లమ్. దాంతో ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. గ్రేటర్లోని ప్రైవేట్హాస్పిటల్స్కు వస్తున్న ఎందరో పరిస్థితి ఇదే. హాస్పిటల్స్లో అన్నిరకాల సేవలు తిరిగి ప్రారంభించాలని సర్కార్ ఆదేశించినా యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు. దాంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ చెకప్లకూ డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు.
20% కూడా అందట్లే..
హైదరాబాద్ జిల్లాలో ప్రైవేట్హాస్పిటల్స్, క్లినిక్లు, నర్సింగ్ హోమ్లు కలిపి 1,228 ఉన్నాయి. లాక్డౌన్కు ముందు వాటిల్లో డైలీ 15 వేల మంది ట్రీట్మెంట్పొందేవారు. 10 వేల మంది దాకా ఇన్పేషెంట్లు ఉండేవారు. లాక్డౌన్తో అన్నింట్లో ఓపీ సేవలు క్లోజ్అయ్యాయి. కొన్నింటిలో ఎమర్జెన్సీ సేవలూ నిలిచిపోయాయి. సేవలు స్టార్ట్ చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా సిటీలో 20 శాతంలోపు హాస్పిటల్స్మాత్రమే ప్రారంభించాయి. వాటిలో క్లినిక్లే ఎక్కువ ఉన్నాయి. కొన్ని హాస్పిటళ్లు ఆన్లైన్లో సేవలందిస్తున్నా.. టెక్నాలజీపై అవగాహన లేనివాళ్లు, ఎమర్జెన్సీ కేసుల వాళ్లకు ఉపయోగపడడం లేదు. హాస్పిటళ్లకు డాక్టర్లు రాకపోవడంతో టెస్టుల్లేక డయాగ్నస్టిక్ సెంటర్లూ పూర్తిస్థాయిలో ఓపెన్ కాలేదు.
యాజమాన్యాలు ఏం చెప్తున్నాయంటే..
లాక్డౌన్ సడలింపులతో ఓపీ చూసేందుకు డాక్టర్లు, స్టాఫ్ భయపడుతున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. తాజా నిబంధనల ప్రకారం.. ఎంట్రెన్స్లో థర్మల్స్క్రీనింగ్, వెయింట్ హాల్లో ఫిజికల్ డిస్టెన్స్కు ఏర్పాట్లు, సెక్యూరిటీ, స్టాఫ్ పెంపు, అదనపు ఏర్పాట్లను భారంగా భావిస్తున్నాయి. అన్ని ఏర్పాట్లు చేశాక పేషెంట్ల సరిగ్గా రాకపోతే నష్టపోతామని చెప్తున్నాయి. తమ దగ్గర ట్రీట్మెంట్ పొందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉంటే, హాస్పిటల్ను 24 రోజులు క్వారంటైన్ చేస్తుండడమూ ఇబ్బందిగా మారిందని పలువురు వాపోతున్నారు.
ప్రికాషన్స్ పాటిస్తూ ట్రీట్మెంట్
ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని రకాల సేవలు ప్రారంభిం చాలని ప్రభుత్వం చెప్పిం ది. పేషెంట్కు కరోనా సింప్టమ్స్ కనిపిస్తే సెలక్టివ్హాస్పిటల్స్కు రెఫర్ చేయాలి. మా హాస్పిటల్లో అన్నిరకాల సేవలు ప్రారంభించాం. డైలీ 30 ఓపీలు వస్తున్నాయి. పీపీఈ కిట్లు, మాస్క్లు ధరించి చికిత్స అందిస్తున్నాం. డాక్టర్లంతా ధైర్యంగా ముందుకు రావాలె.
‑ డాక్టర్ విజయ్ భాస్కర్, రవి హిలియోస్ హాస్పిటల్ ఎండీ
కరోనా భయంతో వస్తలేరు
కరోనా ఎఫెక్ట్తో డాక్టర్లు, సిబ్బంది డ్యూటీలకు రాట్లేదు. ఓపెన్ చేసినా ప్రొటోకాల్ సాధ్యం కాని పని. రోగి వెంట ఒక అటెండర్ మాత్రమే రావాలంటే వినరు. ఇలాంటివి సమస్యలెన్నో ఉన్నాయి. ఆస్పత్రులు పూర్తిస్థాయిలో తెరుచుకోవాలంటే టైం పడ్తది.
‑ డాక్టర్ రాకేశ్ నర్సింగ్ హోమ్స్అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్
ఆస్పత్రులు సీజ్ చేయొద్దు
ఈ మధ్య సిటీలోని ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్వచ్చిందని 24 రోజులు ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆ ఎఫెక్ట్ చాలా ఆస్పత్రుల మీద పడింది. ప్రభుత్వం ఆస్పత్రులకు గైడ్లైన్స్ఇవ్వాలి. సీజ్ చేయడం సరికాదు.
‑ డాక్టర్ హరిప్రకాశ్, నెట్వర్క్ హాస్పిటల్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ
ఉస్మానియాలో అన్నిసేవలు ఉన్నయ్
గవర్నమెంట్ హాస్పిటల్స్ గాంధీ, కింగ్ కోఠిని కరోనా పేషెంట్స్ కోసం కేటాయించారు. జనరల్, ఎమర్జెన్సీ సేవలు ఉస్మానియాకు వెళ్లొచ్చు. అక్కడ డిపార్ట్