
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో పట్నా పైరేట్స్ నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 46–33తో హర్యానా స్టీలర్స్పై గెలిచింది. పట్నా తరఫున రైడర్ మంజిత్ 13, సచిన్ 8, సుధాకర్, క్రిషన్ చెరో ఐదు పాయింట్లు రాబట్టారు. హర్యానా టీమ్లో వినయ్ 12 పాయింట్లు సాధించినా లాభం లేకపోయింది.
రాహుల్ 6, ప్రపంజన్, ఆశిష్, మోహిత్ తలా రెండు పాయింట్లు తెచ్చారు. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 34–33తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. యూపీ రైడర్ ప్రదీప్ నర్వాల్ (12), సురేందర్ గిల్ (7), డిఫెండర్ సుమిత్ (5) సూపర్ పెర్ఫామెన్స్ చేశారు. బెంగళూరు రైడర్ భరత్ (8) మెరిసినా మిగతా ప్లేయర్ల నుంచి సరైన సహకారం అందలేదు. సౌరభ్ (4), అమన్ (3) పోరాడి విఫలమయ్యారు.