హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి గురువారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజ్భవన్లో గవర్నర్తమిళిసై ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈటల రాజేందర్ను తప్పించిన తర్వాత ఖాళీగా ఉన్న బెర్త్ను మహేందర్రెడ్డితో భర్తీ చేయబోతున్నారు. మహేందర్రెడ్డితో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరిగినా ప్రస్తుతం ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
రాష్ట్ర మంత్రివర్గంలో సీఎంతో పాటు 18 మందికే చాన్స్ఉంది. ఇప్పటికే 17 మంది మంత్రులుగా ఉన్నారు. 3 నెలల్లోపే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కేబినెట్నుంచి ఎవరిని తప్పించినా ఆయా జిల్లాల్లో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీలుగా కేబినెట్లో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ ఉన్నారు. వాళ్లిద్దరు మైనార్టీ, ఎస్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఎన్నికలకు ముందు వారిని తప్పించి బీసీని కేబినెట్లోకి తీసుకోవడం సరికాదనే భావనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణను మహేందర్రెడ్డి ఒక్కరికే పరిమితం చేసినట్టుగా తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహేందర్రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్రెడ్డి చేతిలో ఓడిపోయారు.
తర్వాత పైలెట్ బీఆర్ఎస్లో చేరడంతో మహేందర్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు టికెట్పైలెట్కే ఇవ్వడంతో పట్నం మహేందర్రెడ్డిని బుజ్జగించడానికి కేబినెట్లోకి తీసుకుంటున్నారు.