కాంగ్రెస్‌‌ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి : పట్నం సునీతా మహేందర్ రెడ్డి

కాంగ్రెస్‌‌ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి : పట్నం సునీతా మహేందర్ రెడ్డి

గండిపేట, వెలుగు: ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త  సైనికుల్లా కష్టపడి పనిచేయాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు పట్నం సునీతా మహేందర్ రెడ్డి అన్నారు.  మంగళవారం నార్సింగ్‌‌లో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ..   ఆరు గ్యారెంటీ స్కీమ్‌‌లకు ఆకర్షితులై తాము కాంగ్రెస్‌‌లో  చేరామన్నారు.  

అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.  చేవెళ్లలో భారీ మెజార్టీతో కాంగ్రెస్‌‌ అభ్యర్థిని ఎంపీగా గెలిపించాలని కోరారు.  కార్యక్రమంలో  ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షులు రాంమోహన్ రెడ్డి , చల్ల నర్సింహారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌‌చార్జి కస్తూరి నరేందర్  పాల్గొన్నారు.