వైసీపీ ఉప్మా పార్టీ..75 శాతం మంది జగన్ ను వ్యతిరేకిస్తున్నారు

వైసీపీ ఉప్మా పార్టీ..75 శాతం మంది జగన్ ను వ్యతిరేకిస్తున్నారు

వైసీపీ అనేది ఉప్మా పార్టీ అని ముమ్మిడివరం సభలో జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు.  మనం ఐక్యంగా లేకపోతే మళ్లీ వైసీపీ గెలుస్తుందన్నారు.  మాజీ లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి స్ఫూర్తితో కోనసీమ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తానన్నారు. 75 శాతం మంది వైసీపీని వ్యతిరేకిస్తున్నారన్న పవన్ .. ఏపీ సీఎం ఒక ఎంపీ ని కూడా కొట్టించగడని విమర్శించారు.  వైసీపీ పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టి కోనసీమలో అల్లర్లు రేపిందని జనసేనాని ముమ్మిడివరం సభలో అన్నారు.

వైసీపీ గూండాలు రైతులను, మహిళలను బెదిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల రైతుల కన్నీళ్లతో ద్వారంపూడి కుంటుంబం కోట్లకు పడగలెత్తిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.  వైసీపీ నాయకులు బలిసి కొట్టుకున్న...  మాటలు తన దగ్గర పనిచేయవన్నారు.  తాను కులాల గురించి మాట్లాడితే వైసీపీ నేతలు బాధపడుతున్నారంటూ.. నేను ఇట్టే మాట్లాడుతా మీరు భరించండన్నారు.  ఆర్థిక వ్యవస్థ మొత్తం ద్వారంపూడి కుటుంబానికే పరిమితమైందన్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. బాలయోగి తర్వాత కోనసీమ అభివృద్దిని పట్టించుకున్న నాయకుడు లేడని పేర్కొన్న ఆయన కోనసీమకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లేదు, ఏదైనా ప్రమాదం జరిగితే కాకినాడకు వెళ్లాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. 14 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డాను అంటే అది మీ బలం అని, కోనసీమ ప్రజలకు ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇక కోనసీమ ప్రజలకు ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుందన్న ఆయన కోపం వస్తే బ్లూ అవుట్ లా మండి పోతారు ప్రేమ ఆ స్థాయిలోనే ఉంటుందని, అందుకే ఈ ప్రాంతానికి రావాలంటే భయం అని అన్నారు.

ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుకు జనసేన మద్దతు పలికిందని ఆయన అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు రెండు వర్గాల మధ్య విభేదాలు వచ్చాయని, విభేదాలు వచ్చినప్పుడు సమస్య సామరస్యంగా పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి రెండు వర్గాల మధ్య కుల చిచ్చు పెట్టారని అన్నారు. ఎమ్మెల్యేలను కుల సంఘాల నేతల వద్దకు పంపి పరిష్కరించలేదని ఆయన అన్నారు. ఇక వైసీపీకి నేను వ్యతిరేకం కాదన్న పవన్ తాను వైసీపీ నేతల వైఖరికే వ్యతిరేకం అని అన్నారు. ద్వారంపూడి కుటుంబీకులు కోనసీమ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని అంటూ ద్వారంపూడిపై మరోసారి పవన్ ఫైర్ అయ్యారు. కష్టాల్లో ఉన్న కోనసీమ రైతులను ఆదుకోవడం మాని కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని, వైసిపి గుండాల బెదిరింపులకు భయపడం అని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే రైతులకు కన్నీళ్లు మిగిల్చారని, జనసేన గెలిస్తే కన్నీళ్లు ఉండేవి కావని అన్నారు.

ఆంధ్రాను వైసీపీ అనే తెల్లదోమ పట్టి పీడిస్తుందన్నారు. 2014 ఎన్నికల సమయంలో తన సభలకు జనాలు వచ్చారని.. కాని వైసీపీకి ఓట్లు వేశారని పవన్ కళ్యాణ్ అన్నారు.    2024 ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇవ్వండి.. మీకు అండగా నిలపడతానని ముమ్మిడివరం సభలో పవన్ ప్రజలకు హామీ ఇచ్చారు.