పవన్ ఫ్లెక్సీని చించిన జనసేన నేత రేఖగౌడ్

పవన్  ఫ్లెక్సీని చించిన జనసేన నేత రేఖగౌడ్

వైసీపీ నేతలపై ఎమ్మిగనూరు  జనసేన ఇంచార్జ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పేదలకు, పెత్తం దార్లకు  మధ్య జరిగే యుద్ధం అనే పేరుతో వైసీపీ నాయకులు అత్యంత ఆటవికంగా ప్రవర్తించారని..  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పల్లకి మోస్తున్నట్లు ఫ్లెక్సీలో చిత్రీకరించడం దారుణమన్నారు.  అలా ఫ్లెక్సీలు ముద్రించి  వైసీపీ ఎమ్మెల్యేలు ,  నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. అతికించిన ఓ ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు తొలగించారు జనసేన నేత రేఖగౌడ్.
 
వైసీపీ నేతల చర్యల వల్ల  జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు రేఖగౌడ్.  దీనికి ప్రతి చర్యగా కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా యాంటీ బ్యానర్స్ వేయకుండా నిలవరించాలని  డీఎస్పీ సీతారామయ్య , కమీషనర్ గంగిరెడ్డి  మెమోరాండాన్ని రేఖగౌడ్ సమర్పించారు. జిల్లాలోని ఈ ఫ్లెక్సీలో  వేసిన వాటి మీద చర్యలు తీసుకుంటామని హామీ డీఎస్పీ ఇచ్చారని ఆమె అన్నారు.