విడగొట్టాలని చూస్తే మళ్లీ నాలాంటి తీవ్రవాదిని చూడరు : పవన్ కల్యాణ్

విడగొట్టాలని చూస్తే మళ్లీ నాలాంటి తీవ్రవాదిని చూడరు :  పవన్ కల్యాణ్

ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల  ఏపీకి చెందిన కొందరు నేతలు చేసిన కామెంట్స్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. వేర్పాటువాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని పవన్ హెచ్చరించారు. రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పవన్  మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కూర్చోబెడతామన్నారు.

ఉమ్మడి ఏపీకి రాయలసీమ నుంచి చాలా మంది సీఎంలు  వచ్చారన్న పవన్ .. మరి ఆ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. అక్కడ నుంచి వలసలు ఎందుకు ఆపలేకపోయారని నిలదీశారు. ప్రజల కోసమే జనసేన కార్యాలయమన్న పవన్.. జనానికి ఏ సమస్య వచ్చినా పార్టీ ఆఫీస్‌కు రావచ్చని అన్నారు. పార్టీలతో పొత్తులపై పరోక్షంగా స్పందించిన పవన్... ప్రజల అవసరాలకు అనుగుణంగా తాను మారుతానని, తన విధానాలను మార్చుకుంటానని స్పష్టం చేశారు.