ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. తినడానికి తిండి లేదని తండ్రి ఏడుస్తుంటే కొడుకు వచ్చి పరమాన్నం అడిగినట్లు ఉందని ఎద్దేవా చేశారు పవన్. ఉన్న ఒక్క రాజధానికే ఇప్పటి వరకు దిక్కు లేదు గానీ జగన్ మూడు రాజధానులు ఎప్పుడు నిర్మిస్తారంటూ ప్రశ్నించారు పవన్ . పాలకుల వలన ప్రజలకు ఇప్పటి వరకు అనిశ్చితి తప్ప ఒరిగిందేమి లేదన్నారు.
తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట.అలాగా ,ఒక్క అమరావతి… pic.twitter.com/dRAlZZ7OQb
— Pawan Kalyan (@PawanKalyan) December 17, 2019