జీతాల కోసం 150 కోట్లు ఇవ్వండి-సర్కారుకు ఆర్టీసీ మేనేజ్ మెంట్ లేఖ

జీతాల కోసం 150 కోట్లు ఇవ్వండి-సర్కారుకు ఆర్టీసీ మేనేజ్ మెంట్ లేఖ

హైదరాబాద్, వెలుగు: సిబ్బంది జీతాల కోసం రూ.150 కోట్లు ఇవ్వాల్సిందిగా సర్కారును ఆర్టీసీ మేనేజ్ మెంట్ కోరింది. ఈ మేరకు సర్కారుకు సంస్థ ఉన్నతాధికారులు లేఖ రాశారు. జులై నెలలో సర్కారు రూ.150 కోట్లు ఇచ్చింది. ఈసారి సర్కార్ ఆదుకోకపోతే తమ పరిస్థితి ఏంటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.