రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలె

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలె

దేశాన్ని విచిన్నం చేయడానికి బీజేపీ విద్వేషాన్ని నింపుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడి రాహుల్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడేందుకే ఆయన భారత్ జోడో యాత్ర చేపట్టారని అన్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర పీసీసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఈ తీర్మానాన్ని బలపరిచారు. 

పీసీసీ జనరల్ బాడీ మీటింగ్

నాంపల్లి రోజ్ గార్డెన్ లో పీసీసీ జనరల్ బాడీ మీటింగ్ మొదలైంది.  ఈ మీటింగ్ కు ఏఐసీసీ సెక్రెటరీ బోసు రాజు, నదీమ్ జావేద్, పీసీసీ చీఫ్ రేవంత్, ఎంపీ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి ,  వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మెన్ మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి,  మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి.. పీసీసీ నేతలు, డీసీసీ ప్రెసిడెంట్లు హాజరయ్యారు.