- పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ అక్రమ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. 2009 నుంచి 2023 వరకు కేటీఆర్ ఆస్తుల పెరుగుదలపై ఎంక్వైరీ చేయాలని సీబీఐని కోరారు. ఈ మధ్య కాలంలో ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆస్తుల వివరాలను ప్రజలకు తెలుపాలని డిమాండ్ చేశారు.
పెద్ద ఎత్తున ఆస్తులు పెరగడానికి కారణాలేమిటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్పై ఉందని, దీనిపై చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. రూ.4 కోట్ల నుంచి రూ.53 కోట్లకు ఆస్తులు ఎలా పెరిగాయో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. కేటీఆర్అక్రమ ఆస్తులపై సిట్టింగ్జడ్జితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
