పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

 పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

పాల్వంచ, వెలుగు : మండలంలోని కేపీ జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మతల్లి దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పొంగళ్లు, బోనాలు, తలనీలాలు సమర్పించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో శివలింగాన్ని విశేషంగా అలంకరించారు. కాగా ఆలయ ప్రాంగణంలోని వ్యాపార సముదాయాలకు ఈనెల 20న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.

 ఆసక్తిగలవారు ఈ వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు సభ్యులు చీకటి కార్తీక్, పెండ్లి రామిరెడ్డి, చెవుగాని పాపారావు, శనిగారపు శ్రీనివాసరావు, చెరుకూరి శేఖర్ బాబు, దుగ్గిరాల సుధాకర్ పాల్గొన్నారు.