ఐక్యరాజ్యసమితి సమావేశాలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఐక్యరాజ్యసమితి సమావేశాలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు అమెరికా వెళ్లారు  పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. న్యూ యార్క్ లో జరిగే 80వ సర్వసభ్య సమావేశాలకు భారత్ నుంచి అనధికార ప్రతినిధులుగా 31 మంది ఎంపీలను పంపించాలని లోక్ సభ సచివాలయం నిర్ణయించింది. ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమావేశంలో దేశ అభివృద్ధి, సమానత్వం, సామాజికి న్యాయం వంటి అంశాలపై చర్చించనున్నారు.  

ఇప్పటి వరకు ఈ మీటింగ్ కు ఇండియా నుంచి చాలా తక్కువ మంది ఎంపీలు హాజరయ్యారు. అలాంటి గౌరవప్రదమైన వేదికపై పాల్గొనేందుకు తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కింది.  ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా పలు దేశాల ప్రతినిధులతో ఎంపీ వంశీకృష్ణ భేటీ కానున్నారు. ప్రపంచ స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి, సామాజికి సమానత్వం, విద్య,ఉపాధి అవకాశాల పెంపు, పర్యావరణ సమస్యలు, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు.