ఎంపీ వంశీకృష్ణ కృషితో ఈఎస్ఐ హాస్పిటల్

ఎంపీ వంశీకృష్ణ కృషితో ఈఎస్ఐ హాస్పిటల్

గోదావరిఖని: రామగుండం ప్రాంతానికి ఐదేండ్ల కింద ఈఎస్ఐ హాస్పిటల్‌‌‌‌ మంజూరైన విషయం తెలిసిందే. కాగా హాస్పిటల్​ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవ తీసుకుని హాస్పిటల్​ నిర్మాణానికి టెండర్లు పిలిచేలా కృషి చేశారని సీనియర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ పి.మల్లికార్జున్​ తెలిపారు.

ఇందుకు ఎంపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన గురువారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి వివేక్​ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​కు మల్లికార్జున్​  ధన్యవాదాలు తెలిపారు.