
- ఖమ్మం నగర కమిషనర్ అభిషేక్ అగస్త్యా
మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సమీకృత వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్ పార్కు పనితీరుపై ఖమ్మం నగర కమిషనర్ అభిషేక్ అగస్త్యా సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తాతో కలిసి ఆయన ఈ పార్కును సందర్శించారు. యంత్రాల పనితీరు, సామర్థ్యం, ఘన వ్యర్థాలను వేరు చేయడం, కంపోస్ట్ యూనిట్, తడి వ్యర్థాలతో బ్రికెట్స్ తయారీ విధానాన్ని పరిశీలించారు. ప్రాసెసింగ్ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు.