గద్వాల, వెలుగు: దిబ్బ గుంతల స్థలం విషయంలో సర్పంచ్, ఆఫీసర్లపై గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం ఇర్కిచెడు గ్రామస్తులు శుక్రవారం తిరగబడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇర్కిచెడులో దళితులతోపాటు ఇతర కులస్తులు దాదాపు 60 కుటుంబాలవారు చాలా ఏండ్లుగా మసీదు దగ్గర ఉన్న 79, 80 సర్వే నంబర్లో దిబ్బ గుంతలు వేసుకొని స్థలాన్ని ఆధీనంలో పెట్టుకున్నారు. ఇటీవల పల్లె ప్రగతి కార్యక్రమంలో దిబ్బ గుంతలను క్లీన్ చేస్తామంటూ సర్పంచ్ మాధవి యజమానులకు నచ్చజెప్పారు. దిబ్బ గుంతలను క్లీన్ చేశాక వాటిలో రాళ్లు పాతి 48 ప్లాట్లు చేసి ఒక్కొటి రూ. రెండు లక్షల చొప్పున సర్పంచ్ అమ్మకానికి పెట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఎంపీడీఓ, ఎంపీవో, సర్వేయర్ అక్కడకు వచ్చి సర్వే చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్పంచ్ తమను మోసం చేసిందని, ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆఫీసర్ల ముందే పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. దీంతో సర్వే చేయకుండా ఆఫీసర్లు వెనక్కి వెళ్లిపోయారు. గ్రామ కంఠంలో ఆ స్థలం ఉందని, అంగన్వాడీ బిల్డింగ్ లేదా ఇతర గవర్నమెంట్ అవసరాల కోసం వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ చెప్పారు.
సర్పంచ్, ఆఫీసర్లపై తిరగబడ్డరు
- తెలంగాణం
- September 4, 2021
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు